వైద్యులకు 500 వాహనాలు ఇచ్చిన ఓలా
ABN , First Publish Date - 2020-03-31T01:22:15+05:30 IST
కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యుల రవాణా, కరోనా కార్యకలాపాల కోసం 500
బెంగళూరు: కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యుల రవాణా, కరోనా కార్యకలాపాల కోసం 500 వాహనాలు ఇచ్చేందుకు ఓలా క్యాబ్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఓలా క్యాబ్స్ను మంత్రి అభినందించారు. ఓలా ఇచ్చే వాహనాలను వైద్యులు, కోవిడ్ సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగిస్తామన్నారు. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం 21 రోజులపాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఓలా, ఉబెర్, టాక్సీలు, ఆటో రిక్షాలు తదితర వాటిని అనుమతించబోమని ఈ నెల 23న కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే, నిత్యావసర సరుకులు, వైద్య సంబంధిత సేవలకు మాత్రం మినహాయించింది.