బ్యాంకు సర్వీస్ ఛార్జీల పెంపు లేదు...
ABN , First Publish Date - 2020-11-04T00:40:30+05:30 IST
బ్యాంకుల ఖాతాదారులకు మోదీ సర్కార్ తీపికబురునందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చార్జీలు పెంచబోవని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ తాజా ప్రకటనతో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి
న్యూఢిల్లీ : బ్యాంకుల ఖాతాదారులకు మోదీ సర్కార్ తీపికబురునందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చార్జీలు పెంచబోవని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ తాజా ప్రకటనతో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులుపీఎస్బీఎస్ సర్వీస్ చార్జీలను పెంచాయనే మీడియా వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. కోవిడ్ 19 ప్రతికూల సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ చార్జీలను సమీప భవిష్యత్తులో పెంచబోవని ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది.
‘60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదు. జన్ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్, విత్డ్రాయెల్స్పై నిర్ణీత పరిమితి దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చార్జీలు నవంబర్ ఒకటి నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది.