ఆంపియర్ ఈ-స్కూటర్లలో కొత్త వేరియంట్లు
ABN , First Publish Date - 2020-10-01T06:21:10+05:30 IST
గ్రీవ్స్ కాటన్కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త వేరియంట్లను విడుదల చేసింది...
- ప్రారంభ ధర రూ. 42,490
ముంబై: గ్రీవ్స్ కాటన్కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. కంపెనీ రియో, మ్యాగ్నస్, జీల్, వీ48 పేర్లతో పలు మోడళ్లను విక్రయిస్తోంది. దేశంలోని 180 నగరాలు, పట్టణాల్లో కంపెనీకున్న డీలర్షి్పలలో ఈ కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆంపియర్ ఎలక్ట్రిక్ వెల్లడించింది. వీటి ధర మోడల్ను బట్టి రూ.42,490 నుంచి మొదలుకొని రూ.66,949 వరకు ఉంది.