7 రోజుల నష్టాలకు తెర

ABN , First Publish Date - 2020-03-04T06:34:07+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ ఏడు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పడుతున్న ప్రభావాన్ని తట్టుకునేందుకు అవసరమైన కొన్ని విధానపరమైన...

7 రోజుల నష్టాలకు తెర

సెన్సెక్స్‌ 478 పాయింట్లు అప్‌


ముంబై : స్టాక్‌ మార్కెట్‌ ఏడు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పడుతున్న ప్రభావాన్ని తట్టుకునేందుకు అవసరమైన కొన్ని విధానపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్‌బీఐ సహా పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు ప్రకటించడం మార్కెట్‌లో సెంటిమెంట్‌ బలపడేందుకు దోహదపడింది. అందుకు దీటుగానే అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్లను కూడా తగ్గించి మార్గదర్శకంగా నిలిచింది. తుది వార్తలందే సమయానికి అమెరికన్‌ మార్కెట్లు మంచి ర్యాలీలో ట్రేడవుతున్నాయి. కాగా తీవ్రమైన ఆటుపోట్లతో సాగిన సెషన్‌లో సెన్సెక్స్‌ 479.68 పాయింట్లు లాభపడి 38623.70 వద్ద ముగియగా నిఫ్టీ 170.55 పాయింట్ల వద్ద క్లోజయింది. కాగా, మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 43 పైసల నష్టంతో 73.19 వద్ద ముగిసింది. ఇది 16 నెలల కనిష్ఠ స్థాయి.

Updated Date - 2020-03-04T06:34:07+05:30 IST