ఆదాయపు పన్నులో మార్పులు..?
ABN , First Publish Date - 2020-12-21T00:10:38+05:30 IST
రోనా-లాక్ డౌన్ నేపధ్యంలో ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... త్వరలో ప్రవేశపెట్టాల్సి ఉన్న బడ్జెట్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది.

న్యూఢిల్లీ : కరోనా-లాక్ డౌన్ నేపధ్యంలో ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... త్వరలో ప్రవేశపెట్టాల్సి ఉన్న బడ్జెట్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది.
బడ్జెట్లో వైద్యం, ఆరోగ్యంపై ఎక్కువగా కేటాయింపులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు... ఆదాయ పన్ను విషయంలో కూడా భారీ మినహాయింపులనివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే... భారీ కసరత్తు జరుగుతున్నట్లు వినవస్తోంది. ఇక... 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలను 40 శాతానికి తీసుకురావాలని కేంద్రం సంకల్పించింది.