ఫార్మాలో స్ఫూర్తిదాయక పారిశ్రామికులు కిరణ్‌, జీవీ ప్రసాద్‌

ABN , First Publish Date - 2020-04-28T05:33:39+05:30 IST

మాలిక్యూల్స్‌, బయో ఫార్మాలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల జాబితాలో డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌ జీవీ ప్రసాద్‌, బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షాకుస్థానం దక్కింది. మెడిసిన్‌ మేకర్‌ పవర్‌ లిస్ట్‌ 20 పేరిట రూపొందించిన 60 మంది...

ఫార్మాలో స్ఫూర్తిదాయక పారిశ్రామికులు కిరణ్‌, జీవీ ప్రసాద్‌

బెంగళూరు: మాలిక్యూల్స్‌, బయో ఫార్మాలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల జాబితాలో డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌ జీవీ ప్రసాద్‌, బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షాకుస్థానం దక్కింది. మెడిసిన్‌ మేకర్‌ పవర్‌ లిస్ట్‌ 20 పేరిట రూపొందించిన 60 మంది జాబితాలో భారత్‌ నుంచి ఈ ఇద్దరే ఉన్నారు. చిన్న మాలిక్యూల్స్‌, బయో ఫార్మాస్యూటికల్స్‌, అడ్వాన్స్‌డ్‌ మెడిసిన్‌ విభాగాల్లో నవ్యపథం సృష్టించిన వారిని ఈ జాబితాలోకి తీసుకోగా జీవీ ప్రసాద్‌ (చిన్న మాలిక్యూల్స్‌), కిరణ్‌ మజుందార్‌ (బయో ఫార్మా) ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.


  



ఒక్కో విభాగంలో 20 మందికి స్థానం దక్కింది. వారందరూ వృత్తిపరమైన నైపుణ్యాలతోనే పరిశ్రమను ముందుకు నడుపుతున్నారని, కొత్త ఔషధాలు కనుగొనడం ద్వారా లక్షలాది ప్రాణాలను కాపాడుతున్నారని నివేదిక ప్రశంసించింది. ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కోవిడ్‌-19 మహమ్మారికి వీలైనంత త్వరలో కొత్త ఔషధాలు అభివృద్ధి చేసి దాని నిర్మూలనలో కూడా వారు ముందువరుసలో నిలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా కిరణ్‌ మజుందార్‌ షాకు వరుసగా ఆరోసారి ఈ గౌరవం లభించడం తమకు గర్వకారణమని బయోకాన్‌ తెలిపింది.

Updated Date - 2020-04-28T05:33:39+05:30 IST