జోయాలుక్కాస్ ‘గ్లిట్టర్ ఆఫ్ ఇండియా’ ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-03T06:17:17+05:30 IST
కొనుగోలుదారుల కోసం ‘గ్లిట్టర్ ఆఫ్ ఇండియా’ పేరుతో జోయాలుక్కాస్ ముడి వజ్రాలు, విలువైన రాళ్ల నగలను ప్రదర్శిస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొనుగోలుదారుల కోసం ‘గ్లిట్టర్ ఆఫ్ ఇండియా’ పేరుతో జోయాలుక్కాస్ ముడి వజ్రాలు, విలువైన రాళ్ల నగలను ప్రదర్శిస్తోంది. దేశంలోని అన్ని జోయాలుక్కాస్ స్టోర్లలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తోన్నట్లు జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ జోయ్ అలుక్కాస్ తెలిపారు. అరుదైన డిజైన్, సొగసు ఆభరణాలను కంపెనీ ప్రదర్శిస్తోంది. ప్రదర్శనలో రూ.50 వేలు, అంతకుమించి విలువైన రాళ్ల నగలు/వజ్రాలు/ముడి వజ్రాలను కొనుగోలు చేసిన వారికి 500 ఎంజీ బరువున్న బంగారు నాణెన్ని ఉచితంగా ఇస్తున్నారు. రూ.50 వేలు, అంతకుమించి విలువైన ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి 200 ఎంజీ పసిడి నాణెన్ని ఇస్తున్నట్లు జోయాలుక్కాస్ తెలిపింది. ప్రదర్శనలో ప్రదానంగా పెళ్లి నగలను ప్రదర్శిస్తున్నారు. దీంతోపాటు జోయాలుక్కా్సలో కొనుగోలు చేసిన నగలపై ఒక ఏడాది ఉచిత బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అలానే ఉచిత మెయింటినెన్స్ ఉంది.