జియో.. జిల్ జిగేలే!
ABN , First Publish Date - 2020-06-18T06:28:02+05:30 IST
రిలయన్స్ జియో మార్కెట్ వాటా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 48 శాతానికి చేరుకోవచ్చని బెర్న్స్టీన్ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీకి 38.8 కోట్ల మంది వినియోగదారులున్నారు...

- 2024-25 నాటికి 48 శాతానికి
- కంపెనీ మార్కెట్ వాటా: బెర్న్స్టీన్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మార్కెట్ వాటా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 48 శాతానికి చేరుకోవచ్చని బెర్న్స్టీన్ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీకి 38.8 కోట్ల మంది వినియోగదారులున్నారు. 2022-23లో యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటనుందని, 2024-25 నాటికి 56.9 కోట్లకు, 2027-28 నాటికి 60.9 కోట్లకు చేరుకోవచ్చని అంటోంది. గత ఏడాది మార్కెట్ వాటా 36 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 శాతానికి పెరగవచ్చని, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 48 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. సేవల ద్వారా లభించే ఆదాయం వచ్చే మూడేళ్లలో రెట్టింపు అవుతుందని బెర్న్స్టీన్ అంచనా. 2024-25 నాటికి ఆదాయం పరంగా కంపెనీ మార్కెట్ వాటా 44 శాతానికి చేరుకోవచ్చని అంచనా.