కరోనా దెబ్బతో దివాలా పిటిషన్...
ABN , First Publish Date - 2020-08-05T01:41:11+05:30 IST
దిగ్గజ రిటైల్ సంస్థ లార్డ్ & టేలర్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వర్జీనియాలోని ఈస్టర్న్ కోర్టులో దివాలా రక్షణకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది.
న్యూయార్క్ : దిగ్గజ రిటైల్ సంస్థ లార్డ్ & టేలర్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వర్జీనియాలోని ఈస్టర్న్ కోర్టులో దివాలా రక్షణకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా వివిధ రంగాలు, పెద్ద ఎత్తున కంపెనీలు దెబ్బతింటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్నప్పటికీ డిమాండ్ లేమి మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
కరోనా వల్ల చిన్న చిన్న కంపెనీల నుండి పెద్ద సంస్థల వరకు మూతబడటం, లేదా మరోరకంగా దెబ్బతినడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ అమెరికన్ రిటైల్ దిగ్గజం కూడా బ్యాంక్రప్టసీ కోసం దరఖాస్తు చేసుకుంది. కాగా అమెరికాలో ఇప్పటికే పలు సంస్థలు దివాలా తీయడమో, లేదా... దివాలా పిటిషన్లు దాఖలు చేయడమో జరిగింది. అదే కోవలోకి... తాజాగా లార్డ్ & టేలర్ కూడా చేరింది.