మార్కెట్లో ‘బోర్డర్’ టెన్షన్
ABN , First Publish Date - 2020-09-01T06:34:50+05:30 IST
స్టాక్ మార్కెట్ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. లద్దాఖ్లో చైనా దళాలు చొరబడేందుకు ప్రయత్నించాయన్న వార్తలు మార్కెట్ను వణికించాయి...

ముంబై: స్టాక్ మార్కెట్ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. లద్దాఖ్లో చైనా దళాలు చొరబడేందుకు ప్రయత్నించాయన్న వార్తలు మార్కెట్ను వణికించాయి. దీంతో సెన్సెక్స్ 839.02 పాయింట్ల నష్టపోయి 38,628.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260.10 పాయింట్ల నష్టంతో 11,387.50 వద్ద ముగిసింది. ఇంట్రాడే హైతో పోలిస్తే సెన్సెక్స్ 1,600 పాయింట్లు నష్టపోయింది.