రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి: సీఐఐ

ABN , First Publish Date - 2020-03-23T05:32:07+05:30 IST

కరోనా ద్వారా ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడేందుకు రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక సహాయ ప్యా కేజీ కావాలని భారత పారిశ్రామిక రంగం కోరింది. కంపెనీలు బ్యాంకులకు ..

రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి: సీఐఐ

న్యూఢిల్లీ: కరోనా ద్వారా ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడేందుకు రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక సహాయ ప్యా కేజీ కావాలని భారత పారిశ్రామిక రంగం కోరింది. కంపెనీలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఏడాది వాయి దా వేయడంతో పాటు పన్ను రేట్లను తగ్గించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ రూ.2 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ పథకం  కిం ద ప్రజలకు బదిలీ చేయాలని కోరింది. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకోకపోతే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు 5ు దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.

Updated Date - 2020-03-23T05:32:07+05:30 IST