మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కార్వీ
ABN , First Publish Date - 2020-03-05T06:21:01+05:30 IST
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కార్వీ
ఎస్ఎ్ఫఐఓ విచారణ ఆపాలని విజ్ఞప్తి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కార్వీ గ్రూపు మరోసారి హై కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థలపై ఎస్ఎ్ఫఐఓ విచారణకు ఆదేశిస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కార్వీ, దాని అనుబంధ సంస్థలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల ని కోరుతూ తాము దాఖలు చేసిన వ్యాజ్యం విచారణలో ఉండగానే సెబీ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చింది.