హీరో, మహీంద్రా వాహన ధరల పెంపు
ABN , First Publish Date - 2020-12-17T07:11:51+05:30 IST
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన విక్రయదారైన హీరో మోటోకార్ప్ ధరలు పెంచేసింది. 2021 జనవరి 1

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన విక్రయదారైన హీరో మోటోకార్ప్ ధరలు పెంచేసింది. 2021 జనవరి 1 నుంచి తమ టూవీలర్ల ధర మోడల్ను బట్టి రూ.1,500 వరకు పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
జనవరి నుంచి ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహన ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సైతం ప్రకటించింది.