5.7 శాతం వాటా... రూ.25,480 కోట్లు
ABN , First Publish Date - 2020-05-08T06:36:48+05:30 IST
ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్)లో 5.7 శాతం వాటాలను రూ.25,480 కోట్లకు విక్రయించినట్లు గ్లాక్సో స్మిత్క్లైన్ పీఎల్సీ...
![5.7 శాతం వాటా... రూ.25,480 కోట్లు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- హెచ్యూఎల్లో వాటా విక్రయించిన జీఎ్సకే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్)లో 5.7 శాతం వాటాలను రూ.25,480 కోట్లకు విక్రయించినట్లు గ్లాక్సో స్మిత్క్లైన్ పీఎల్సీ (జీఎ్సకే) ప్రకటించింది. భారతీయ ఈక్విటీ మార్కెట్లో ఇదే అతిపెద్ద బ్లాక్ ట్రేడ్ కావటం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్లో హెచ్యూఎల్లో అనుబంధ సంస్థ గ్లాక్సో స్మిత్క్లైన్ కన్య్సూమర్ హెల్త్కేర్ లిమిటెడ్ (జీఎ్సకే ఇండియా) విలీన పథకంలో భాగంగా జీఎ్సకే పీఎల్సీ ఈ వాటాలను అందుకుంది. హెచ్యూఎల్లో అనుబంధ సంస్థలైన గ్లాక్సో స్మిత్క్లైన్ పీటీఈ లిమిటెడ్, హార్లిక్స్ లిమిటెడ్కు ఉన్న 13.37 కోట్ల ఆర్డినరీ షేర్లను విక్రయించినట్లు వెల్లడించింది. ఒక్కో షేరు ను సగటున రూ.1,905 ధరకు విక్రయించినట్లు తెలిపింది.