జీఓసీఎల్ చేతికి ఏపీడీఎల్ ఎస్టేట్స్
ABN , First Publish Date - 2020-08-07T06:45:46+05:30 IST
ఏపీడీఎల్ ఎస్టేట్స్ (ఏపీడీఎల్ఈ)ను జీఓసీఎల్ కార్పొరేషన్ సొంతం చేసుకుంటోంది. హిందుజా రియల్టీ వెంచర్స్ (హెచ్ఆర్వీఎల్) నుంచి రూ.62 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు జీఓసీఎల్ తెలిపింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏపీడీఎల్ ఎస్టేట్స్ (ఏపీడీఎల్ఈ)ను జీఓసీఎల్ కార్పొరేషన్ సొంతం చేసుకుంటోంది. హిందుజా రియల్టీ వెంచర్స్ (హెచ్ఆర్వీఎల్) నుంచి రూ.62 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు జీఓసీఎల్ తెలిపింది. వాణిజ్య భవనాలు, ఇతర రియల్టీ ప్రాజెక్టుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీడీఎల్ఈకి హైదరాబాద్ బేగంపేటలో ఒక వాణిజ్య భవన సముదాయం ఉంది. బెంగళూరులోని మల్లేశ్వరంలో కూడా వాణిజ్య భవనం ఉంది.