క్యూ1లో రెండంకెల తిరోగమనం: డీబీఎస్
ABN , First Publish Date - 2020-07-08T06:09:51+05:30 IST
కొవిడ్-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1)లో రెండంకెల స్థాయి తిరోగమనం చవిచూడవచ్చని డీబీఎస్ అంచనా వేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 3.1 శాతం వృద్ధి రేటు...
ముంబై: కొవిడ్-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1)లో రెండంకెల స్థాయి తిరోగమనం చవిచూడవచ్చని డీబీఎస్ అంచనా వేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 3.1 శాతం వృద్ధి రేటు నమోదైంది. కరోనా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని జీడీపీని వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మదింపు చేసేందుకు తమ పరిశోధన విభాగం నౌ కాస్టింగ్ మోడల్ అనుసరిస్తున్నదని, దాని ప్రకారం రెండో త్రైమాసికంలో రెండంకెల తిరోగమనం నమోదు కావచ్చుని తాజా నివేదికలో తెలిపింది. అయితే ఆర్థిక సంవత్సరం చివరికి మాత్రమే వృద్ధి రేటు సాధారణ స్థాయికి రావచ్చని, ఏడాది మొత్తం మీద అది మైనస్ 4.8 శాతం ఉండవచ్చని డీబీఎస్ బ్యాంక్ ఆర్థికవేత్త రాధికా రావు అన్నారు. ఈ మహమ్మారిని అదుపు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా తమ అంచనా కన్నా వాస్తవ వృద్ధి 1 నుంచి 1.5 శాతం మేరకు దిగజారే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు.