ఎంఎ్సఎంఈల కోసం త్వరలో ఫండ్ ఆఫ్ ఫండ్స్
ABN , First Publish Date - 2020-08-11T06:10:11+05:30 IST
ఒత్తిడిలో ఉన్న ఎంఎ్సఎంఈలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 10 వేల కోట్ల పరిమాణం గల ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్వరలో అందుబాటులోకి రానున్నదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు...

న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న ఎంఎ్సఎంఈలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 10 వేల కోట్ల పరిమాణం గల ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్వరలో అందుబాటులోకి రానున్నదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ఆదాయాలు భారీగా పడిపోయి తీవ్రమైన నిధుల కొరత ఏర్పడిన ఎంఎ్సఎంఈలకు ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంఎ్సఎంఈలకు లిక్విడిటీ సహాయం అందించేందుకు బ్యాంకులు ఇప్పటికే అత్యవసర రుణ సదుపాయం అందిస్తున్నాయని, ఈ కొత్త ఫండ్ వారికి మరింత అండగా ఉంటుందని రజనీష్ అన్నారు.