దశాబ్దంలో మొదటిసారి.. భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌, పీసీల అమ్మకాలు

ABN , First Publish Date - 2020-10-13T02:11:00+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలలు కూడా పూర్తిగా తెరుచుకోలేదు. పలు విద్యాసంస్థలు... ‘ఆన్‌లైన్’ తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ-లెర్నింగ్ పెరిగింది.దీంతో ల్యాప్‌‌టాప్‌లతో పాటు పీసీలకు డిమాండ్ పెరిగింది.

దశాబ్దంలో మొదటిసారి.. భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌, పీసీల అమ్మకాలు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలలు కూడా పూర్తిగా తెరుచుకోలేదు. పలు విద్యాసంస్థలు... ‘ఆన్‌లైన్’ తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ-లెర్నింగ్ పెరిగింది.దీంతో ల్యాప్‌‌టాప్‌లతో పాటు పీసీలకు డిమాండ్ పెరిగింది.


దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా వాటి అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో పీసీల విక్రయం జరిగింది. కంపెనీల పరంగా 2019 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 2020 ఇదే క్వార్టర్‌లో పీసీల అమ్మకాలు భారీగా పెరిగాయి. లెనోవో 11.4 శాతం, హెచ్‌పీ 11.9 శాతం, ఆపిల్ 13.2 శాతం, ఏసర్ 15 శాతం అమ్మకాలు పెరిగాయి. కేవలం డెల్ సేల్స్ మాత్రం 0.5 శాతం క్షీణించడం గమనార్హం.


ఇక... ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 79.2 మిలియన్ల పీసీలు, ల్యాప్‌టాప్ అమ్మకాలు జరిగాయని కెనాలిస్ డేటా వెల్లడిస్తోంది. పదేళ్ళలో మొదటిసారి... అమ్మకాలు సగటున 13 శాతం పెరిగాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ తరగతుల కారణంగా...  పీసీలకు డిమాండ్ పెరిగినట్లుసమాచారం. వీటిలో 64 మిలియన్లతో ల్యాప్‌టాప్‌లు మొదటి స్థానంలో ఉండగా, పీసీలు, నోట్ బుక్స్, ట్యాబ్స్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.


ఇక... అమ్మకాలు తగ్గినప్పటికీ...  డెల్ కంపెనీ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. గడిచిన పదేళ్లలో పీసీల అమ్మకాలు ఈ స్థాయికే పరిమితం కావడం ఇదే మొదటిసారి. 

Updated Date - 2020-10-13T02:11:00+05:30 IST