ఈ-వే బిల్లు గడువు మార్చొద్దు
ABN , First Publish Date - 2020-12-30T08:43:44+05:30 IST
ఈ-వే బిల్లుల గడువు మార్పును రవాణా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరుకు రవాణా చేసే ట్రక్కులకు ఒక

ట్రాన్స్పోర్టర్ల వినతి
న్యూఢిల్లీ: ఈ-వే బిల్లుల గడువు మార్పును రవాణా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరుకు రవాణా చేసే ట్రక్కులకు ఒక రోజుకు చెల్లుబాటయ్యే ఈ-వే బిల్లు ప్రయాణ దూరాన్ని కేంద్ర ప్రభుత్వం 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పెంచింది. దీని వల్ల ఔషధాలు, నిత్యావసరాలతో సహా అనేక సరుకుల రవాణాకు అడ్డంకులు ఏర్పడి దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) హెచ్చరించింది.
ఈ నెల 22న జారీ చేసిన ఈ ఉత్తర్వులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సరుకులు లోడ్ చేసుకుని గమ్య స్థానానికి చేర్చేందుకు దూరం, వాహనం, రోడ్ల స్థితిగతులను బట్టి కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఏఐఎంటీసీ పేర్కొంది.