మళ్లీ చమురు మంట!
ABN , First Publish Date - 2020-04-14T06:42:03+05:30 IST
ముడి చమురు ధర మళ్లీ మండే సూచనలు కనిపిసున్నాయి. మే, జూన్ నెలల్లో రోజువారీ చమురు ఉత్పత్తిని 97 లక్షల పీపా ల మేర తగ్గించేందుకు రష్యాతో పాటు సౌదీ అరేబియా నాయకత్వంలోని ‘ఒపెక్’ దేశాలు...
![మళ్లీ చమురు మంట!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- ఉత్పత్తిలో కోతకు ఓకే
వియన్నా: ముడి చమురు ధర మళ్లీ మండే సూచనలు కనిపిసున్నాయి. మే, జూన్ నెలల్లో రోజువారీ చమురు ఉత్పత్తిని 97 లక్షల పీపా ల మేర తగ్గించేందుకు రష్యాతో పాటు సౌదీ అరేబియా నాయకత్వంలోని ‘ఒపెక్’ దేశాలు అంగీకరించాయి. పడిపోతున్న ధరలను కట్టడి చేసేందుకు చమురు ఉత్పత్తి దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ ముడి చము రు ఉత్పత్తిని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 5 శాతం నుంచి 7.7 శాతం వరకు పెరిగింది. పీపా బ్రెంట్ రకం ముడి చమురు 5 శాతం పెరిగి 33.08 డాలర్లకు చేరింది. అయితే కరోనా వైరస్ దెబ్బతో రోజువారీ డిమాండ్ ఏప్రిల్లో 2.7 కోట్ల పీపాలు, మేలో రెండు కోట్ల పీపాల మేర తగ్గే అవకాశం ఉన్నందున, ధరలు పెద్దగా పెరగక పోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.