30 లోపు సీజీఎస్టీ రిఫండ్స్!
ABN , First Publish Date - 2020-04-14T06:44:41+05:30 IST
లాక్డౌన్ సమయంలో నిలిచిపోయిన సెంట్రల్ జీఎ్సటీ రిఫండ్స్ను ఈ నెల 30 లోపు చెల్లించనున్నట్లు జీఎ్సటీ అధికారులు వె ల్లడించారు. ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను...
![30 లోపు సీజీఎస్టీ రిఫండ్స్!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లాక్డౌన్ సమయంలో నిలిచిపోయిన సెంట్రల్ జీఎ్సటీ రిఫండ్స్ను ఈ నెల 30 లోపు చెల్లించనున్నట్లు జీఎ్సటీ అధికారులు వె ల్లడించారు. ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యల ను పరిష్కరించడానికి పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు వారు తెలిపారు. కాగా, హైదరాబాద్ జీఎ్సటీ అండ్ కస్టమ్స్ జోన్లో జీఎ్సటీ-కస్టమ్స్ హెల్ప్ డెస్క్ను ఏర్పా టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెల జీఎ్సటీ రిటర్నుల దాఖలు గడువును, ఈ-వే బిల్స్ గడువును పొడిగించారు.