80 రోజుల కాలపరిమితితో బీఎస్ఎన్ఎల్ నుంచి మరో కొత్త రీచార్జ్ ఓచర్
ABN , First Publish Date - 2020-08-14T02:25:05+05:30 IST
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 80 రోజుల కాలపరిమితితో రూ. 399తో సరికొత్త రీచార్జ్ ఓచర్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 80 రోజుల కాలపరిమితితో రూ. 399తో సరికొత్త రీచార్జ్ ఓచర్ను ప్రవేశపెట్టింది. రోజుకు 250 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్ పరిమితి కలిగిన ఈ ప్లాన్ను చెన్నై, తమిళనాడు సర్కిళ్లలో ప్రకటించింది. అలాగే, ఈ రెండు సర్కిళ్లలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ. 399 టారిఫ్ ఓచర్, రూ. 1699 రీచార్జ్ ఓచర్లను తొలగించింది. తాజాగా ప్రకటించిన రూ. 399 ప్లాన్ ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ ప్లాన్లో రోజుకు 1 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఎఫ్యూపీ పరిమితి ముగిసిన తర్వాత డేటా వేగం 80 కేబీపీఎస్కు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి. అలాగే, లోక్ధున్ కంటెంట్ కూడా ఉచితంగా లభిస్తుంది. కాలపరిమితి 80 రోజులు.