బీఓబీ నష్టం రూ.864 కోట్లు
ABN , First Publish Date - 2020-08-11T06:05:58+05:30 IST
జూన్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రూ.864 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు పెరగటంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని తెలిపింది...
న్యూఢిల్లీ: జూన్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రూ.864 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు పెరగటంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.710 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలం లో మొత్తం ఆదాయం స్వల్పంగా 2.38 శాతం తగ్గి రూ.18,494 కోట్లు గా నమోదైంది.