ఎయిర్‌టెల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-07-28T01:43:56+05:30 IST

ఎంపిక చేసిన ఖాతాదారులకు అదనంగా 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఖాతాదారులకు అదనంగా 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనంగా ఈ డేటా ఉచితంగా లభిస్తుంది. అయితే, ఈ 1జీబీ అదనపు డేటా అందరికీ కాదు. ఎంపిక చేసిన వినియోగదారులకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ అదనపు డేటా కాలపరిమితి మూడు రోజులు మాత్రమే. గత నెలలో రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు నాలుగు రోజుల కాలపరిమితితో రోజుకు 2జీబీ ఉచిత డేటా అందించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఈ ఉచిత డేటాను ప్రకటించింది.


రూ. 48 డేటా ప్యాక్‌ను రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు సాధారణంగా 3జీబీ డేటా లభించగా ఇప్పుడు అదనంగా ఒక జీబీతో కలిసి 4జీబీ డేటా లభిస్తుంది. అలాగే, రూ. 49 స్మార్ట్ రీచార్జ్ ప్యాక్‌పైనా అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్యాక్‌లో 100 ఎంబీ డేటా, రూ. 38.52 టాక్ టైం లభించగా ఇప్పుడు అదనంగా 1జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు. 

Updated Date - 2020-07-28T01:43:56+05:30 IST