అమరరాజా లాభంలో 55శాతం క్షీణత
ABN , First Publish Date - 2020-08-08T06:27:11+05:30 IST
జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్ రూ.62.68 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.140.91 కోట్లతో పోలిస్తే 55 శాతం తగ్గింది..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్ రూ.62.68 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.140.91 కోట్లతో పోలిస్తే 55 శాతం తగ్గింది. ఈ కాలంలో ఆదాయం కూడా 37 శాతం క్షీణించి రూ.1,815 కోట్ల నుంచి రూ.1,151 కోట్లకు పరిమితమైంది. కొవిడ్, లాక్డౌన్లతో తయారీ, సరఫరా, అమ్మకాలు, పంపిణీ వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా ఆదాయం, లాభం తగ్గాయని అమర రాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. వాహనాల ఉత్పత్తి లేక పోవడం వల్ల కంపెనీల నుంచి ఆటోమోటివ్ బ్యాటరీలకు గిరాకీ తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కొవిడ్ ప్రభావం ఎగుమతులపై కూడా ఉందని తెలిపింది.