కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ

ABN , First Publish Date - 2020-08-12T22:56:00+05:30 IST

కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ

కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ

ప్రకాశం: ఏపీలో కరోనా విజృంభిస్తున్నా భారీ ఎత్తున జన సమీకరణతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీయధేచ్ఛగా కోవిడ్‌ నిభందనలు ఉల్లంఘిస్తోంది. ఒంగోలు కలెక్టరేట్‌లో వైయస్సార్ చేయూత కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి లబ్ధిదారులను అధికార యంత్రాంగం తరలించింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కార్యక్రమ అనంతరం పెద్ద ఎత్తున మంత్రిని కార్యకర్తలు చుట్టుముట్టారు. ఇప్పటికే ఒంగోలు నగరంలో 1500 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంది. అయినప్పటికీ మంత్రులు తీరు మార్చుకోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సింది పోయి తరచూ భారీ జన సమీకరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టుతప్పే అవకాశం ఉందంటూ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కరణం బలరాం, అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు. 

Updated Date - 2020-08-12T22:56:00+05:30 IST