3 రాజధానులు, స్థానిక ఎన్నికలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-20T00:09:05+05:30 IST

మూడు రాజధానులు అనేది వైసీపీ విధానం.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

3 రాజధానులు, స్థానిక ఎన్నికలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

విశాఖ: మూడు రాజధానులు అనేది వైసీపీ విధానం.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విధాలా సంప్రదించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాలనా రాజధాని విశాఖ, శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కేంద్రం, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం.. కానీ మా ఆలోచన మాత్రం కర్నూలు న్యాయ రాజధాని అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


ప్రభుత్వం అనుకున్నప్పుడే స్థానిక ఎన్నికలు..

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్నట్లుగానే జరుగుతాయని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. న్యాయ స్థానంలో తేలిన తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. చంద్రబాబు అన్నింటిని నెగిటివ్‌గానే ఆలోచిస్తారని విమర్శించారు. నిన్న పోలీసు పడిపోయిన దాన్ని కూడా అదే విధంగా చిత్రీకరించారని చెప్పారు. ఆయనలో ఉన్న మూర్ఖత్వం, దుర్మార్గపు ఆలోచన పోనంతవరకు ఆయన, ఆ పార్టీ మనుగడ కష్టమని చెప్పారు. 


వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 9 వరకు  వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రతీ ఏడాది విశాఖలో ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు. యువత ఆశయ సాధన కోసం చిత్తశుద్ధితో సాధించాలనే ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-20T00:09:05+05:30 IST