రైతులకు బేడీలు తప్పే : నందిగం సురేశ్
ABN , First Publish Date - 2020-10-31T07:40:56+05:30 IST
రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అంగీకరించారు.
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అంగీకరించారు. దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దళితులంతా ఒక్కటేనని, చంద్రబాబు మాయలో పడొద్దని రైతులను కోరారు.