రోజా అనుమతి అవసరం లేదు: మంత్రి నారాయణస్వామి
ABN , First Publish Date - 2020-05-26T22:40:22+05:30 IST
తాను పుత్తూరులో పర్యటించేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుమతి అవసరంలేదని ఏబీఎన్తో మంత్రి నారాయణస్వామి చెప్పారు.
తిరుపతి: తాను పుత్తూరులో పర్యటించేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుమతి అవసరంలేదని ఏబీఎన్తో మంత్రి నారాయణస్వామి చెప్పారు. రోజా పర్మిషన్ తీసుకోవడానికి తాము ఆమెకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టలేదని, గిరిజన యువజన సంఘాన్ని 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామని చెప్పారు. మా సంఘం తరపున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని నారాయణస్వామి అన్నారు. అక్కడ కల్యాణ మండపం నిర్మించాలనుకున్నామని, కలెక్టర్ తిరుపతికి వెళ్తూ పుత్తూరు వచ్చి స్థలాన్ని పరిశీలించారని నారాయణస్వామి పేర్కొన్నారు.