ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో వైసీపీ నేతల కమీషన్‌ దందా

ABN , First Publish Date - 2020-12-13T15:17:25+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అధికారపార్టీ నేతలకు కామధేనువుగా మారింది.

ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో వైసీపీ నేతల కమీషన్‌ దందా

కృష్ణాజిల్లా: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అధికారపార్టీ నేతలకు కామధేనువుగా మారింది. కృష్ణా జిల్లాలో ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో పలువురు వైసీపీ నేతలు పక్కా రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. ఎందుకూ పనికిరాని, నివాసయోగ్యం కానీ భూములను సేకరించి రూ. కోట్లలో కమీషన్లు దండుకుంటున్నారు. తమకు కమీషన్లు ఇవ్వనివారు తమ పార్టీ వారైనా ఏమాత్రం ఉపేక్షించడంలేదు. అధికారపార్టీ నాయకుడికి చెందిన భూమిని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి.. చివరి నిముషంలో కమీషన్ ఇవ్వలేదన్న షాకుతో మొత్తం భూ సేకరణ ప్రక్రియను రద్దు చేశారనే ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2020-12-13T15:17:25+05:30 IST