కరోనా వ్యాప్తికి ‘వైసీపీ’నే కారణం
ABN , First Publish Date - 2020-04-21T09:03:19+05:30 IST
‘‘రాష్ట్రం లో కరోనా అదుపు తప్పడానికి వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరే కారణం. నన్ను

సాయిరెడ్డికి దమ్ముంటే కాణిపాకంలో ప్రమాణం చేయాలి: కన్నా
గుంటూరు(సంగడిగుంట), ఏప్రిల్ 20: ‘‘రాష్ట్రం లో కరోనా అదుపు తప్పడానికి వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరే కారణం. నన్ను కొనేవారు రా ష్ట్రంలో పుట్టలేదు. విజయసాయిరెడ్డి మగాడైతే, దమ్ముంటే... తన ఆరోపణలపై నమ్మకముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలి’’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. గుంటూరులో సోమవారం మాట్లాడారు. కేవలం రాజకీయం కోసమే ఆరోపణలు చేస్తున్నారన్నారు. జైల్లో చిప్పకూడు తినే వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తే ఆకాశంపై ఉమ్మి వేసినట్లేనన్నారు.