నెల్లూరులో వైసీపీతో జతకట్టిన సీపీఐ
ABN , First Publish Date - 2020-03-13T09:13:56+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఎన్నికల బరిలో...
![నెల్లూరులో వైసీపీతో జతకట్టిన సీపీఐ](https://media.andhrajyothy.com/appimg/galleries/202003130314035/03132020034353n25.jpg)
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. అయితే, నెల్లూరు రూరల్ మండలంలో మాత్రం సీపీఐ నాయకులు వైసీపీతో పొత్తుపెట్టుకున్నారు. ఎంపీటీసీ స్థానం వైసీపీకి, సర్పంచ్ స్థానం సీపీఐకి.. ఇలా సీట్లను పంచుకొని ఒకరికొకరు గెలుపు కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ప్రచారం కూడా ప్రారంభించారు.
- నెల్లూరు