‘విశాఖలో వేలాది ఎకరాల భూములపై వైసీపీ కన్నేసింది’
ABN , First Publish Date - 2020-12-13T17:15:24+05:30 IST
‘విశాఖలో వేలాది ఎకరాల భూములపై వైసీపీ కన్నేసింది’

అమరావాతి: అమరావతి రైతుల పోరాటం చిరస్మరణీయమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 13 జిల్లాల ప్రయోజనం కోసమే రైతుల పోరాటం చేస్తున్నారని చెప్పారు. రాజధాని పట్ల జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు. 13 జిల్లాల వెన్నెముకను వైసీపీ విరిచేస్తోందని మండిపడ్డారు. విశాఖలో వేలాది ఎకరాల భూములపై వైసీపీ కన్నేసిందన్నారు.