మూడు ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం: యనమల
ABN , First Publish Date - 2020-08-02T16:24:39+05:30 IST
జగన్ ప్రభుత్వం ఏడాది పాలనలో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యమని..
విజయవాడ: జగన్ ప్రభుత్వం ఏడాది పాలనలో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ది గురించి వైసీపీ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. విశాఖలో ఫిన్ టెక్ వ్యాలీ, మెడ్ టెక్ జోన్ నాశనం చేయడమా అభివృద్ధి? అని ప్రశ్నించారు. విశాఖలో రూ.70 వేల కోట్ల అదాని డేటా సెంటర్ తరిమేయడమేనా వైసీపీ అభివృద్ధి? అంటూ నిలదీశారు. విశాఖను భూకబ్జాదారుల అడ్డాగా చేయడమా వైసీపీ చేసిన అభివృద్ధి? సీమలో సోలార్ ప్లాంట్ల యజమానులను తుపాకులతో బెదిరించడమా వైసీపీ అభివృద్ధి? ప్రకాశంలో రూ.25 వేల కోట్ల పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీ పోగొట్టడమేనా అభివృద్ధి? అమరావతిలో 139సంస్థలు పోగొట్టి వేలాది ఉద్యోగాలు లేకుండా చేయడమా వైసీపీ అభివృద్ది? 13జిల్లాలలో 14నెలల్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడమా అభివృద్ధి? అంటూ యనమల రామకృష్ణుడు అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.