పద్య, వచన కవిత పోటీల విజేతలకు 21న బహుమతుల ప్రదానం
ABN , First Publish Date - 2020-03-08T11:02:19+05:30 IST
యానాంలో ఆంధ్రీకుటీరం, కవిసంధ్య సంయుక్తంగా నిర్వహించిన పద్య, వచన కవిత పోటీల విజేతల వివరాలను కవిసంధ్య సంపాదకుడు డాక్టర్ శిఖామణి, కన్వీనర్ దాట్ల దేవదానం రాజు వెల్లడించారు.

కవిసంధ్య సంపాదకుడు శిఖామణి
యానాం, మార్చి 7: యానాంలో ఆంధ్రీకుటీరం, కవిసంధ్య సంయుక్తంగా నిర్వహించిన పద్య, వచన కవిత పోటీల విజేతల వివరాలను కవిసంధ్య సంపాదకుడు డాక్టర్ శిఖామణి, కన్వీనర్ దాట్ల దేవదానం రాజు వెల్లడించారు. వచన కవితలకు న్యాయనిర్ణేతగా అద్దేపల్లి ప్రభు వ్యవహరించారు. ప్రథమ బహుమతి పంట పువ్వు-సీహెచ్ లక్ష్మీనాయుడు (కెన్గువ), ద్వితీయ బహుమతి ఊరు మారిపోయింది-లండ సాంబమూర్తి (ఒంకులూరు), తృతీయ బహుమతి చీకటి పాట-శిఖా అకాష్ (నూజవీడు), కన్సొలేషన్ తలదిండు-శిల్ప జగదీష్ (హైదరాబాద్), వీధి బాలుడు-కొలూరి ప్రసాదరావు (వేళ్లు చింతలగూడెం), మీ టూ, నెత్తురోడని గాయాలు- ఆవాల శారద (విజయవాడ) ఎంపికయ్యారు. పద్యాల పోటీల్లో వరుసగా ఆకాంక్షకు-కందిపాటి గోపాలరావు (నెల్లూరు), వెర్రి రైతు-శినారా (ముమ్మిడివరం), పరిష్కారం-పూసల రజనీ గంగాధర్ (హైదరాబాద్) కన్సొలేషన్ బహుమతులు సామాజిక దృశ్యమాలిక-ఎ.గోపినాధరావు (కోటిపల్లి), మహాకవి జాషువా-డాక్టర్ కేవీఎల్ఎన్ శర్మ (విజయవాడ), మహిళా సంరక్షణీయ-డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు (రాజమహేంద్రవరం) ఎంపికయ్యారని శిఖామణి తెలిపారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 21న యానాంలో బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు.