నా కూతుర్ని కాపాడండి.. మంత్రికి ఓ తల్లి సెల్ఫీ వీడియో
ABN , First Publish Date - 2020-12-07T00:55:38+05:30 IST
ఏలూరులో వింతరోగం కలకలం రేపుతోంది. 100 మంది వరకు అస్వస్థతకు గురి కావడం స్థానికుల్లో ఆందోళన చెలరేగింది. దీంతో ..

ప.గో: ఏలూరులో వింతరోగం కలకలం రేపుతోంది. 100 మంది వరకు అస్వస్థతకు గురి కావడం స్థానికుల్లో ఆందోళన చెలరేగింది. దీంతో తన కూతురిని కాపాడాలంటూ మంత్రికి ఓ తల్లి సెల్ఫీ వీడియో పంపింది. ఏలూరులో చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారని ఆమె తెలిపారు. అయితే తన బిడ్డ శనివారం నుంచి ఏమీ తినలేదని, పైకి లేచిన వెంటనే పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు కూడా తమకేమీ చెప్పలేదని ఆమె వాపోయారు.