ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-22T18:39:47+05:30 IST
నెల్లూరు: ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
నెల్లూరు: ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఊనుగుంటపాలేనికి చెందిన రాణి(23) అనే మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రదీప్ (5), సుధీర్ (2)లకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.