తిరుమలలోకి వన్యప్రాణులు

ABN , First Publish Date - 2020-03-25T08:16:53+05:30 IST

నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమల క్షేత్రాన్ని ప్రస్తుతం నిశ్శబ్దంగా ఆవరించడంతో క్రమేపీ వన్యప్రాణి సంచారం...

తిరుమలలోకి వన్యప్రాణులు

  • భక్తులు లేకపోవడంతో జంతుసంచారం

నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమల క్షేత్రాన్ని ప్రస్తుతం నిశ్శబ్దంగా ఆవరించడంతో క్రమేపీ వన్యప్రాణి సంచారం పెరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 20 నుంచి శ్రీవారి దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తిరుమల కొండలు భక్తులు లేక నిర్మానుష్యంగా మారాయి.   ఆదివారం అర్ధరాత్రి కల్యాణవేదిక, ముళ్లగుంట పార్క్‌, మెకాళ్లమిట్ట, ఎస్వీ గెస్ట్‌హౌస్‌ సమీప ప్రాంతాల్లో రెండు చిరుతపులులు, ఓ ఎలుగుబంటి వచ్చినట్టు అటవీ అధికారుల దృష్టికి వచ్చింది. తాజాగా, సోమవారం రాత్రి మొదటి ఘాట్‌రోడ్డులోని లింక్‌ రోడ్డు వద్ద ఓ చిరుతపులి పిట్టగోడ పక్కన మొబైల్‌ పార్టీ కంటపడింది.             

-తిరుమల


Updated Date - 2020-03-25T08:16:53+05:30 IST