డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నాం: డీజీపీ

ABN , First Publish Date - 2020-07-06T02:10:46+05:30 IST

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నాం: డీజీపీ

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నాం: డీజీపీ

విశాఖ: విశాఖపట్నంలో ఈ రోజు డ్రగ్స్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గతంలో రేవ్ పార్టీలో సరఫరా చేసిన వాళ్లే మళ్లీ మొదలు పెట్టారని, వారి మీద నిఘా పెట్టి పట్టుకున్నామని డీజీపీ అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెడుతున్నామని, మావోయిస్టు సహకారంతోనే గంజాయి సాగు చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో విశాఖ పోలీసులు కష్టపడి పని చేశారని డీసీపీ అన్నారు. తొలి 3 నెలల్లో కేవలం 98 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. సడలింపు తర్వాత కేసులు క్రమంగా పెరిగాయని, జూన్ 3 నుంచి సడలింపుల తర్వాత కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. కోవిడ్-19పై పోరాటంలో మన రాష్ట్రం దేశంలో ప్రత్యేకంగా నిలిచిందని, 466 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారని డీజీపీ అన్నారు. జూన్ 3 వరకు కేవలం 45 మంది పోలీసులు మాత్రమే కోవిడ్ బారిన పడ్డారని డీజీపీ తెలిపారు. గత నెల రోజుల్లో 421 మందికి కోవిడ్ వచ్చిందని, అన్ని చోట్ల క్షేత్ర స్థాయిలో పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారని చెప్పారు. అనేక రాష్ట్రాల కంటే మనం మొదటి నుంచి అప్రమత్తత కలిగి ఉన్నామన్నారు. కరోనా సమయంలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న విశాఖ ప్రజలకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-07-06T02:10:46+05:30 IST