మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: రామానాయుడు

ABN , First Publish Date - 2020-06-18T20:01:00+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులు, బీసీలపై..

మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: రామానాయుడు

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులు, బీసీలపై చేస్తున్న దాడులు, పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నదానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా పోరాటం చేస్తామని అన్నారు.


గుంటూరులో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును కలవడానికి అనుమతి లేని స్థితిలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నామని రామానాయుడు అన్నారు. ఆపరేషన్ జరిగి 24 గంటలు కూడా గడవకుండానే ఆయను కారులో కూర్చోబెట్టి 6 వందల కి.మీ. ప్రయాణం చేయించడంతో బ్లడ్ బ్లీడింగ్ అవుతోందని, కంట్రోల్ కావడంలేదని చెప్పారని, నిన్న మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారన్నారు. ప్రస్తుతం అచ్చెన్న ఆరోగ్యం నిలకడగానే ఉందని  సూపరింటెండెంట్‌ చెప్పారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నను టార్గెట్ చేసిందని రామానాయుడు అన్నారు.

Updated Date - 2020-06-18T20:01:00+05:30 IST