రాష్ట్రంలో పరిస్థితులకు వైసీపీ, టీడీపీ బాధ్యత వహించాలి: విష్ణు

ABN , First Publish Date - 2020-10-14T16:45:01+05:30 IST

తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి దర్శించుకున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులకు వైసీపీ, టీడీపీ బాధ్యత వహించాలి: విష్ణు

తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు కరోనాతో, వర్షాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అభివృద్ధిలో ముందుండాల్సిన ఏపీలో వివాదస్పదమైన వ్యాఖ్యలతో... అధికార, ప్రతిపక్షాలు ముందుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు వైసీపీ, టీడీపీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు కొందరితో ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేయిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అభివృద్ధికి వినియోగించడం లేదన్నారు. జగన్‌, చంద్రబాబులు ఏపీ పరువు గంగలో కలిపేశారని విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-10-14T16:45:01+05:30 IST