సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామంటూ టోకరా
ABN , First Publish Date - 2020-09-03T14:20:27+05:30 IST
సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామంటూ ఓ మహిళ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడింది.

విశాఖపట్నం: సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామంటూ ఓ మహిళ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడింది. నెల్లూరుకు చెందిన శ్రావణికి హైమావతి అనే మహిళ రూ.1.40 కోట్లకు టోకరా వేసింది. కరోనా వల్ల ప్రచారం చేయలేదని నెల్లూరు మహిళను నమ్మించి మోసానికి పాల్పడింది. ఆలయ ఈవో భ్రమరాంబ వేలంకి అనుమతి ఇచ్చినట్లు ఫోర్జరీ నోటీసును చూపించి ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే రసీదు ఇచ్చి బంగారం ఇవ్వకపోవడంతో అనుమానంతో ఆలయ అధికారులను సంప్రదించగా... అలాంటి సంప్రదాయం లేదని అధికారులు చెప్పారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు దేవస్థానం ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.