విశాఖ సాల్వెంట్స్: శ్రీనివాసరావు కుటుంబానికి పరిహారం
ABN , First Publish Date - 2020-07-15T12:51:29+05:30 IST
విశాఖ: విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి యజమాన్యం
![విశాఖ సాల్వెంట్స్: శ్రీనివాసరావు కుటుంబానికి పరిహారం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విశాఖ: విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.