‘విదేశాల నుంచి వచ్చినవారు నేరుగా క్వారంటైన్‌కు’

ABN , First Publish Date - 2020-05-10T21:52:45+05:30 IST

విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని..

‘విదేశాల నుంచి వచ్చినవారు నేరుగా క్వారంటైన్‌కు’

విజయవాడ: విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని విజయవాడ ఎయిర్ పోర్టు డైరెక్టర్ మదుసూధనరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విదేశాలలో ఉండిపోయినవారిని స్వదేశాలకు తీసుకువచ్చేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు.


వందే భారత్ ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కున్నవారిని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని మదుసూధనరావు తెలిపారు. ఏపీకి సంబంధించి విజయవాడ, విశాఖ, తిరుపతికి మూడు విమానాలు వస్తున్నాయన్నారు. సోమవారం మొదటి విమానం విజయవాడకు వస్తుందన్నారు. అయితే వారిని నేరుగా క్వారంటైన్‌కు పంపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. వారి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా కలుసుకునే అవకాశం ఉండదని మదుసూధనరావు స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-10T21:52:45+05:30 IST