అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-08-22T17:32:23+05:30 IST
వినాయకుడు రాష్ట్రానికి విఘ్నాలన్నీ తొలగించాలి అని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో జె.ఏ.సీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ: వినాయకుడు రాష్ట్రానికి విఘ్నాలన్నీ తొలగించాలి అని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో జె.ఏ.సీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా నిలపడానికి ఉన్న విఘ్నాలు వినాయకుడు తొలగించాలని కోరారు. రేపటికి నిరసనలకు 250 రోజులు పూర్తవుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం అనే నినాదంతో రేపు ఉదయం నుంచీ నిరసనలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి తరఫున ప్రతీ ఒక్కరికీ ఒక మొక్క కూడా రేపు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మార్చుకునేలా ఆ విఘ్నేశ్వరుడు ప్రభుత్వానికి బుద్ధినివ్వాలి అని శివారెడ్డి కోరారు.