విజయనగరం: సీహెచ్సీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2020-08-11T18:04:30+05:30 IST
జిల్లాలోని ఎస్ కోట సీహెచ్సీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు పనులను బహిష్కరించి నిరసనకు దిగారు.

విజయనగరం: జిల్లాలోని ఎస్ కోట సీహెచ్సీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు పనులను బహిష్కరించి నిరసనకు దిగారు. పీపీఈ కిట్లతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని గేటు బయట ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప విధులకు హాజరయ్యేది లేదని పారిశుద్ధ్య కార్మికులు స్పష్టం చేశారు.