ఏలూరులో 607కు చేరిన వింత వ్యాధి బాధితులు

ABN , First Publish Date - 2020-12-11T14:40:07+05:30 IST

ఏలూరులో వింత వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది.

ఏలూరులో 607కు చేరిన వింత వ్యాధి బాధితులు

 ప.గో.: ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా  వింత వ్యాధి బాధితుల సంఖ్య 607కు చేరింది. ప్రస్తుతం 35 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో దాదాపు 538 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే విజయవాడ, గుంటూరులో  33 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  బాధితుల్లో ఎక్కువగా 76 మంది 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. 


మరోవైపు వింత వ్యాధికి తాగునీటి కాలుష్యమే కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  తాగునీరు స్వచ్ఛంగా ఉందని, రిపోర్టులన్నీ ‘నార్మల్‌’ వచ్చాయని అధికారులు తొలినుంచీ ప్రకటిస్తుండగా... అసలు సమస్య నీళ్లలోనే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఏలూరులో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో నీళ్లలో విష రసాయనాల అవశేషాలున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలినట్లు సమాచారం.

Updated Date - 2020-12-11T14:40:07+05:30 IST