వారిపై దాడే ఇందుకు నిదర్శనం: వర్ల
ABN , First Publish Date - 2020-05-27T23:30:23+05:30 IST
ప్రమాదంలో ప్రజాస్వామ్యం తీర్మానాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రవేశపెట్టారు.
అమరావతి: ప్రమాదంలో ప్రజాస్వామ్యం తీర్మానాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రవేశపెట్టారు. ఏపీలో నియంత పాలన నడుస్తుంది...బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రశ్నించినందుకే డా.సుధాకర్ను రోడ్డుపైకి లాగి పిచ్చివాడిని చేశారని చెప్పారు. జగన్ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకు వస్తోందన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే ఎస్ఈసీని తొలగించారని మండిపడ్డారు. ఏపీని న్యాయవ్యవస్థే కాపాడుతోంది, సీఎం జగన్ దళిత ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకపు పాలన ప్రశ్నించకపోతే భవిష్యత్ అంధకారమేనని వ్యాఖ్యానించారు.