రాజ్యాంగ సంక్షోభం రాకుండా చూసుకోండి: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2020-08-01T19:33:07+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ఈ మేరకు జగన్ సర్కార్కు సూచనలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ఈ మేరకు జగన్ సర్కార్కు సూచనలు చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ! ఎస్ఈసీ కేసులో ఎదుర్కొన్న పెను ప్రమాదం గ్రహించి, రాజధాని మహిళల ఆక్రందన గమనించండి, వారి సమస్య సమంజసమని దేశమంతా తెలుసు, ఒక్క మీ ప్రభుత్వానికి తప్ప. సమస్య తీవ్రత నెరిగి, మరో పెను ముప్పు రాకముందే, రాజధాని మార్పు మానుకోoడి, రాజ్యాంగ సంక్షోభం రానీయకండి. చరిత్ర హీనులవకండి.’ అంటూ వర్ల ట్వీట్ చేశారు.
