‘మంత్రి.. కంత్రి.. ఇంతి’పై సీబీఐ వేయాలి: వర్ల

ABN , First Publish Date - 2020-06-25T08:14:27+05:30 IST

‘మంత్రి.. కంత్రి.. మధ్యలో ఇంతి’ అంటూ విశాఖ రాసలీలల వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులపై సీబీఐ దర్యాప్తు ..

‘మంత్రి.. కంత్రి.. ఇంతి’పై సీబీఐ వేయాలి: వర్ల

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘మంత్రి.. కంత్రి.. మధ్యలో ఇంతి’ అంటూ విశాఖ రాసలీలల వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామ య్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దలు ఉన్న ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులో లేదా సీఐడీనో దర్యాప్తు చేస్తే ఏ ఉపయోగం ఉండదని, సీబీఐ దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. విశాఖలో వైసీపీ భూ కుంభకోణాలే వినిపించాయని, ఇప్పుడు రాసలీలల వ్యవహారాలతో ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారని అన్నారు. ఈ మేరకు బుధవారం వర్ల మీడియాతో మాట్లాడారు. టీడీపీ వర్గీయులపై అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై మేం ఫిర్యాదు చేస్తే పోలీస్‌ శాఖ ఏం చర్య తీసుకుందని ప్రశ్నించారు.

Updated Date - 2020-06-25T08:14:27+05:30 IST